Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి చుట్టూ ఓ వివాదం తిరుగుతోంది. ఏపీలోని దేవాదాయ శాఖ అధికారి శాంతి… ప్రెగ్నెంట్ విషయం. శాంతి అనే అధికారి విజయసాయి రెడ్డి ప్రెగ్నెంట్ అయిందని ఆమె మాజీ భర్త మదన్మోహన్ ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలపై తాజాగా విజయసాయిరెడ్డి స్పందించారు. Vijayasai Reddy

Big shock for Jagan Vijayasai Reddy new channel to compete with Sakshi

ఆదివాసి మహిళా అయిన శాంతి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని… దీని వెనుక చంద్రబాబు మీడియా ఉందని ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. తనకు అలాగే శాంతికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. అమాయకంగా ఉన్న శాంతిని అడ్డం పెట్టుకొని…తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహించారు. Vijayasai Reddy

Also Read: Bandi Sanjay: బీజేపీ పార్టీలోకి హరీష్ రావు?

ముఖ్యంగా, టీవీ5 ఏబీఎన్ మరియు మహా న్యూస్ చానల్స్ ను ఏకి పారేశారు విజయసాయిరెడ్డి. తనపై కావాలనే కుట్రలు చేస్తున్నాయని ఈ చానల్స్ పై మండిపడ్డారు. అంతేకాదు వైసిపి నేతలు కొంతమంది తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి తనపై బురద జరుగుతున్నారని ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. Vijayasai Reddy

అలాంటి వారి భరతం త్వరలోనే పడతానని హెచ్చరించారు. అంతేకాకుండా.. త్వరలోనే కొత్త న్యూస్ ఛానల్ పెట్టబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు.ఎప్పుడో తాను పెట్టాలని అనుకున్నానని.. కానీ ఇప్పుడు కచ్చితంగా పెడితే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం ప్రజల పక్షాన తన ఛానల్ పనిచేస్తుందని వివరించారు. Vijayasai Reddy