Raj Tharun Malvi Malhotra Chat Leaked

Raj Tharun: హీరో రాజ్ తరుణ్ వ్యవహారం రోజు రోజు కి ముదిరిపోతుంది. ఆయనకు మాల్వీ మల్హోత్రా కు మధ్య ఎదో ఉందని అయన భార్య లావణ్య ఆరోపణల నేపథ్యంలో తాజాగా వారి మధ్య జరిగిన చాటింగ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు ఏ హోటల్ రూమ్ లో కలిశారు వంటి వివరాలు దీనినుంచి వెలువడడం గమనార్హం. 2023లో రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాకు ప్రపోజ్ చేశాడు. ఆమె దానిని అంగీకరించింది. ఆ తర్వాత చాలా సార్లు హోటల్ బుకింగ్స్ చేశాడు. మాల్వీ, రాజ్ తరుణ్ తమకు ఎలాంటి సంబంధం లేదని ఇద్దరు కొన్నాళ్లుగా చెబుతున్న నేపథ్యంలో వారి చాట్‌లు లీక్ కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది.

Raj Tharun Malvi Malhotra Chat Leaked

మాల్వీ, రాజ్ తరుణ్‌లపై లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు రాజ్ తరుణ్‌కి నోటీసులు కూడా జారీ చేశారు. రాజ్ తరుణ్ గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేదు. షూటింగ్ మరియు బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని రాజ్ తరుణ్ పోలీసులకు లేఖ రాసి తన న్యాయవాదిని పంపాడు. విచారణలో పాల్గొనేందుకు పోలీసులను మరికొన్ని రోజులు గడువు కోరారు. మాల్వీ మల్హోత్రా వల్లే రాజ్ తనకు దూరమయ్యారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: Nawazuddin Siddiqui: సౌత్ సినిమాలు నార్త్ సినిమాల కంటే గొప్పవి కావా..నవాజుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యలు వైరల్!!

మరోవైపు హీరోయిన్ మాల్వీ కూడా లావణ్యపై కేసు పెట్టింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోగా.. రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని, అబార్షన్ చేయించాడని లావణ్య పోలీసులకు పూర్తి ఆధారాలు ఇచ్చింది. అదే సమయంలో లావణ్య కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కలకలం రేపింది. అయితే తర్వాత లావణ్య ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందో టీవీ9కి వివరించింది. తనకు రాజ్ తరుణ్ కావాలని.. అతని కోసం తాను పోరాడుతున్నానని వెల్లడించింది. తాను, రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా కలిసి ఉన్నామని వివరించింది. రాజ్ తరుణ్ కోసం నిరాహార దీక్ష చేస్తానని… ఈ విషయంలో సినిమా పెద్దలను కలుస్తానని ఆమె స్పష్టం చేసింది. తనపై ఉన్న డ్రగ్స్ కేసు తప్పుడు కేసు అని ఆమె అన్నారు.