Chiranjeevi in ram charan peddi movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస ప్లాపులలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న విశ్వంభర సినిమా తో మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను చేస్తున్నాడు. వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రెండవ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో సినిమా చేయడం విశేషం. ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను వేరే లెవల్లో చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉప్పెన సినిమాతో రికార్డ్స్ సృష్టించిన ఈ డైరెక్టర్ తన రెండవ సినిమాను పాన్ ఇండియా సినిమాగా చేస్తుండగా క్రీడా నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని మొదటి నుంచి వినిపిస్తున్న మాట.

Chiranjeevi in ram charan peddi movie

ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలిస్తూ ఉండగా దాదాపు ఇదే ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.సినిమా కథ మొత్తం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది అని అంటున్నారు. తాజాగా వినిపిస్తున్న మాట ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. ఇది మెగా ఫాన్స్ ని ఉత్సాహపరిచే విషయం. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కనిపించడం అంటే మంచి విషయమే అయినా కూడా ఆచార్య సినిమా గుర్తొస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కలవరపడుతున్నారు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి చాలా సినిమాలలో కనిపించారు.

Also Read: Prabhas: సలార్ ఎఫెక్ట్.. ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించేశాడా?

మగధీర సినిమాలో చిరంజీవి కొన్ని నిమిషాల పాటు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోగా బ్రూస్ లీ సినిమాలో కూడా రామ్ చరణ్ కోసం ఆయన చిన్న కామియో చేశారు. అలాగే ఆచార్య సినిమాలో కూడా చిన్న కామియో చేసి హిట్టు కొట్టాలని భావించగా అది దారుణంగా విఫలం అయింది. ఆ విధంగా వీరు కలిసి నటించిన మూడు సినిమాలలో రెండు సినిమాలు దారుణంగా ప్లాప్ అయిన నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి ఈ సినిమాలో కనిపించడాం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది చెబుతున్న మాట.

ఈ సినిమాకు రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా బుచ్చిబాబు ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ కు ఈ సినిమా ఆయన ఇమేజ్ ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని గేమ్ చెంజర్ సినిమా ను పూర్తి చేయడానికి రామ్ చరణ్ చూస్తున్నాడు. ఈ సినిమా ను డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.