Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అందరూ రాజకీయ నాయకుల లాగా కాకుండా… చాలా డిఫరెంట్ గా ముందుకు వెళుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులకు పదవులు రాగానే… ప్రజలు అసలు గుర్తుకురారు. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల సమస్యలపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. Pawan Kalyan

Pawan Kalyan the real hero washing the officials on the road

ఎక్కడ సమస్య వచ్చినా… వాలిపోతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికితీస్తున్న పవన్ కళ్యాణ్… తాజాగా తన పార్టీ ఆఫీస్ కు వచ్చిన వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగిపోయారు. ప్రజలకు సౌకర్యంగా రోడ్డుపైన ప్రజాదర్బార్ నిర్వహించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీస్ కు వచ్చిన… ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసేoదుకు… జనాలు ఎగబడుతున్నారు. Pawan Kalyan

Also Read: KCR: కేసీఆర్ కు బిగ్ షాక్.. మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్.. లిస్ట్ ఇదే ?

సినిమా స్టార్ అలాగే, కొత్తగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కావడంతో… చాలామంది ప్రజలు… పవన్ కళ్యాణ్ ను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. అందులో కొంతమంది సమస్యలు చెప్పుకోవడానికి వస్తే… మరికొంతమంది ఆయనను చూసి తరించిపోవాలని అనుకుంటున్నారు. దీంతో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ ముందు పెద్ద క్యూ లైన్ చోటుచేసుకుంది. Pawan Kalyan

అయితే ఆ క్యూ లైన్ చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే…స్పందించారు. ప్రజలను చూసి వెంటనే కారు దిగి… జనసేన పార్టీ ఆఫీస్ ముందే కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు… చర్యలు తీసుకుంటామని అక్కడే హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Pawan Kalyan