Pawan kalyan green signal to his hold movies

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న, ఆగిపోయిన సినిమాలకు మోక్షం లభించినట్లే అని చెప్పాలి. ఆయన హీరోగా తెరకెక్కే మూడు సినిమాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలోని ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలోని ‘ఓజీ’ అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలోని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు పవన్ నటిస్తున్న ఆగిపోయిన సినిమాలు. అనూహ్యంగా ఎన్నికలలో విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిపోయిన నేపథ్యంలో ఈ సినిమాలు ఆగిపోయాయి.

Pawan kalyan green signal to his hold movies

ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ సముఖంగా ఉన్నాడని నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నాయి. మొదటగా ఆయన ‘ఓజీ’ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారట. సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ చిత్ర బృందం నుంచి దీనికి సంబంధించిన ఓ అప్డేట్ కూడా ఇవ్వబోతుంది అని చెబుతున్నారు.

Also Read: Dhanush: ధనుష్ ఎందుకు వాళ్ళలా ప్రభావం చూపలేకపోతున్నాడు!!

దీనికోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అభిమానులు ఇచ్చిన స్పందన మరో స్థాయిలో ఉంది. అందుకే ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకులందరికీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమా చేస్తున్నారట చిత్ర బృందం. అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. మైత్రి మూవీస్ వారి సినిమాకు సంబంధించిన షూటింగ్ ను వచ్చే ఏడాది చేయాలని పవన్ సూచించారట.

మరి గత నాలుగైదు సంవత్సరాలుగా హోల్డ్ లో ఉంటూ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే మొదటి చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా గురించి పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకపోవడం సదర నిర్మాత పై మరింత ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను పక్క పెట్టి దర్శకుడు హరీష్ శంకర్ వరస ఇతర చిత్రాలు చేసుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విడుదలకు సిద్ధమవగా ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా ఓ సినిమాను చేయబోతున్నాడు.