producer wife Varalakshmi passes away

Varalakshmi: సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి.ఒకరి మరణం మరువక ముందే మరొకరు మరణిస్తూ ఇండస్ట్రీకి, కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి కన్నుమూశారు.. మరి ఆమె మరణానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

producer wife Varalakshmi passes away

ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించి స్టార్ నిర్మాతగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలు ప్రసారం అయ్యే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత కూడా శ్యాంప్రసాద్ రెడ్డి.. అయితే అలాంటి ఈయన ప్రొడ్యూసర్ గా అరుంధతి, అంజి,అమ్మోరు, అంకుశం వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు నిర్మాతగా చేసి స్టార్ నిర్మాతలలో ఒకరిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. (Varalakshmi)

Also Read: Naga Chaitanya: బ్రేకింగ్..ఆ హీరోయిన్ తో ఈరోజే నాగచైతన్య ఎంగేజ్మెంట్..?

అలాంటి ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూతురు అయినటువంటి వరలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఇక వరలక్ష్మి సోదరుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యేగా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో గెలిచారు.

producer wife Varalakshmi passes away

గత కొద్ది సంవత్సరాల నుండి క్యాన్సర్ తో బాధపడుతున్న వరలక్ష్మి నిన్న అనగా బుధవారం రోజు తుది శ్వాస విడిచారు. వరలక్ష్మి మరణంతో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు.(Varalakshmi)