Jagan: జగన్మోహన్ రెడ్డి దంపతులపై తాజాగా ట్రోలింగ్ జరుగుతోంది.జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్ భారతి తాజాగా ఓ విమానంలో ప్రయాణిస్తూ కనిపించారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ట్రోలింగ్ చేయడం జరుగుతుంది.వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన హెలికాప్టర్ లేదా విమానాలలో వెళ్లేవారు. Jagan

Jagan Goes From Special Flight To Back Seat

పక్క జిల్లాకు వెళ్లాలనుకుంటే కచ్చితంగా హెలికాప్టర్ వాడే వారట జగన్మోహన్ రెడ్డి. కొన్ని సమయాలలో కాన్వాయ్ లోనే వెళ్లేవారు. ఆంధ్రప్రదేశ్ దాటి పక్క రాష్ట్రం వెళితే కచ్చితంగా ప్రత్యేకంగా హెలికాప్టర్ లేదా విమానమే… జగన్మోహన్ రెడ్డి గతంలో వాడినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. Jagan

Also Read: YCP: వైసీపీ సోషల్ మీడియా కోసం రంగంలోకి విజయమ్మ ?

అయితే అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యే గానే ఉంటున్నారు.ఇందులో భాగంగానే ఇటీవల ఏపీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దంపతులు… తాజాగా మళ్లీ బెంగళూరు వెళ్ళిపోయారు. అయితే బెంగళూరుకు వెళ్లే నేపథ్యంలో… సదాసీదా ప్రయాణికుల లాగానే విమానంలో వెళ్లారు జగన్మోహన్ రెడ్డి దంపతులు. Jagan

అంతేకాకుండా విమానంలో చివరి సీట్లో వైయస్ భారతి అలాగే జగన్మోహన్ రెడ్డి కూర్చోవడం జరిగింది. దీంతో కొంతమంది దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లిన జగన్ ఇప్పుడు చివరి సీట్లో కూర్చున్నాడని అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి దంపతులు ముందు కూర్చుంటే.. జనాలంతా అక్కడే ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది.దిగేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయితే చివరి సీట్ లో కూర్చుంటే… ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు అని.. జగన్ ఇలా చేశారట. Jagan