Cm Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువు తీశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుతో తనకు పోటీ లేదని… తనకు ప్రపంచంతోనే పోటీ అంటూ రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు రెండో తేదీన అమెరికా అలాగే కొరియా పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది. Cm Revanth Reddy

Revanth Reddy Comments On Chandrababu

దాదాపు 15 రోజులపాటు రేవంత్ రెడ్డి విదేశాలలోనే ఉన్నారు. ఈ సందర్భంగా 30 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 31 వేల కు పైగా ఉద్యోగాలు కూడా రాబోతున్నట్లు తెలిపింది. గులాబీ ప్రభుత్వం కంటే ఎక్కువ కంపెనీలను అమెరికా వెళ్లి తీసుకు వచ్చామని రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. Cm Revanth Reddy

Also Read: Revanth Reddy: వారికి రేవంత్ రెడ్డి చల్లని కబురు.. నేటినుంచే అమలు!!

అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కాగ్నెంట్ కంపెనీ మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలో తీసుకు వెళ్లేందుకు కష్టపడుతున్నామని తెలిపారు. వచ్చే పది ఏళ్లలో.. దేశంలోనే ఉన్నత స్థాయికి తెలంగాణ చేరుతుందని వివరించారు. Cm Revanth Reddy

పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక అలాగే తమిళనాడు రాష్ట్రాలతో తాను పోటీ పడడం లేదని… ప్రపంచం తోనే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుతో కూడా పోటీ పడడం లేదని.. తన దగ్గర హైదరాబాద్ ఉందని తెలిపాడు. అయితే గతంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలని.. ఆయన కంటే ఎక్కువగా పని చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. Cm Revanth Reddy