Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు కింగ్ లా ఉండేవారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి.. పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పవచ్చును. హీరో నుంచి జీరో వరకు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి. అయితే.. మొన్న జరిగిన ఎన్నికల్లో 14 స్థానాలే సంపాదించుకున్న వైసీపీ పార్టీ.. ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. Jagan

Jagan, Vijayasai Seeks Permission To Fly Abroad

ఇదే నేపథ్యంలో… వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నేతలను టార్గెట్ చేసి మరి అరెస్టు చేస్తోంది తెలుగుదేశం కూటమి సర్కార్. ఇలాంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి… పార్టీని పట్టించుకోకుండా.. విదేశాలకు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Jagan

Also Read: Harish Rao: సిద్దిపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ?

ఇందులో భాగంగానే సిబిఐ కోర్టు అనుమతి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకునేందుకు ముందుకు వెళ్లారట. సెప్టెంబర్ మాసంలో లండన్ వెళ్లేలా.. అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును జగన్ మోహన్ రెడ్డి ఆశ్రయించారట. జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా.. పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. Jagan

అయితే సిబిఐ కోర్టు నుంచి అనుమతి రాగానే… జగన్మోహన్ రెడ్డి దంపతులు విదేశాలకు వెళ్తారని తెలుస్తోంది. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లడం… చాలా తప్పిదం అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. Jagan