Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం.. అనేక ఆటుపోటులను ఎదుర్కొంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాలుగు స్థానాలు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో… వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. Jagan

Prashant Kishore again in the field for Jagan

అడుగడుగునా వైసిపి నేతలను టార్గెట్ చేసి మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేసులు పెడుతూ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్ వస్తున్నారని సమాచారం. అతి త్వరలోనే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డిని ప్రశాంత్ కిషోర్ కలవనున్నాయని సమాచారం. Jagan

Also Read: Hydra: హైడ్రా విధ్వంసం… రేవంత్ పై సోనియా సీరియస్ ?

ప్రస్తుతం వైసీపీ పార్టీ కష్టాల్లో ఉన్న నేపథ్యంలో మళ్లీ వీరిద్దరూ కలిసి వైసిపి నీ ఫామ్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. 2019 సమయంలో వైసిపి కోసం ప్రశాంత్ కిషోర్ చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో 150కి పైగా వైసిపి విజయం సాధించింది. అయితే మళ్లీ 2029 ఎన్నికల కోసం వైసీపీ పార్టీని సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారట ప్రశాంతి కిషోర్. Jagan

ఈ మేరకు ఇప్పటికే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంకేతాలు కూడా పంపారట ప్రశాంత్ కిషోర్. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తిగా లేనట్లు సమాచారం. చూద్దాంలే చేద్దాంలే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Jagan