Manchu Lakshmi: That tablet for beauty

Manchu Lakshmi: మంచు లక్ష్మి నిజంగానే అందం కోసం టాబ్లెట్స్ వేసుకుంటే అవి బెడిసి కొట్టి తన మొహానికి ఇలా అయ్యిందా..ఇంతకీ మంచు లక్ష్మికి వచ్చిన ప్రాబ్లం ఏంటి..ఆమె నోటి చుట్టూ ఎందుకు అలా ప్లాస్టర్స్ వేసుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. మంచు మోహన్ బాబు తనయిరాలిగా సినిమాల్లో హీరోయిన్ అవుదామని ఎన్నో కలలుగన్న మంచు లక్ష్మికి ఇండస్ట్రీలో చుక్కెదురయింది.హీరోయిన్ అవకాశాల కంటే ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ అవకాశాలే వచ్చాయి.ఇక ఈ మధ్యకాలంలో ముంబైకి వెళ్లి బాలీవుడ్ లో రాణిద్దామని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Manchu Lakshmi: That tablet for beauty

ఇక ముంబైకి వెళ్ళాక తన వేషం కూడా మార్చేసింది. పొట్టి పొట్టి స్కర్టులు, బికినీలు వేస్తూ మంచు ఫ్యామిలీ పరువు మొత్తం తీసేస్తోంది అని మంచు హీరోల అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక హీరో కూతురు అలా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే చాలామంది అభిమానులు యాక్సెప్ట్ చేయలేరు. ప్రస్తుతం మంచు లక్ష్మి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇక ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి ఎన్నో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది.అంతేకాదు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుంది. (Manchu Lakshmi)

Also Read: Namitha: లోపలికి వెళ్ళనివ్వకుండా టార్చర్ చేశారు.. హీరోయిన్ నమిత షాకింగ్ కామెంట్స్..?

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు సంబంధించిన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు చూస్తే మంచు లక్ష్మి కి ఏమైందో అని అందరూ గాబరాపడుతున్నారు.ఇక మంచు లక్ష్మి కి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మంచు లక్ష్మి పెదవి అలర్జీ వల్ల పగిలిపోయిందట. దానికి ప్రధాన కారణం ఆమె వేసుకునే టాబ్లెట్స్ లో మోతాదుకు మించి మరో రెండు టాబ్లెట్లు ఎక్కువగా వేసుకోవడం కారణంగా అలర్జీ వచ్చి ఆమె పెదవి పగిలిపోయిందట.దీంతో వెంటనే ఆమె దగ్గర ఆమె ఫ్రెండ్ డాక్టర్ ఉండడం వల్ల ఎలాంటి అపాయం జరగలేదని,ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ మంచి లక్ష్మి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాదు మన శరీరానికి ఏది అవసరమో అదే తీసుకోవాలి.

Manchu Lakshmi: That tablet for beauty

మోతాదుకు మించి తీసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ మంచు లక్ష్మి ట్వీట్ పెట్టింది. ఇక మంచు లక్ష్మి వేసుకున్న టాబ్లెట్ ల కారణంగా ఆమె పెదవి పగిలి ఎలర్జీ రావడంతో దానికి సంబంధించిన వైద్యం చేయించుకుంది. ఇక ఇది జరిగి రెండు వారాలు అయిందని, ఎలర్జీ తగ్గాక బాలకృష్ణతో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు నిశితంగా గమనిస్తే మంచు లక్ష్మి పెదవికి ఇంకా గాయం మాననట్టు తెలుస్తోంది. ఇక ఈమె ఫోటోలు చూసినా చాలామంది నెటిజన్లు అందం కోసం వేసుకునే టాబ్లెట్లు వికటించి మంచు లక్ష్మీ పెదవి పగిలిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Manchu Lakshmi)