Trisha: దక్షిణాది అగ్ర నటీమణుల్లో ఒకరైన త్రిష నలభై ఏళ్ల వయసులో కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరించడంలో ఏమాత్రం తగ్గట్లేదు. “నువ్వొస్తాంటే నేనొద్దనంతానా”, “వర్షం”, “పౌర్ణమి” వంటి చిత్రాలతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష అటు తమిళంలో కూడా మంచి అవకాశాలు రాబట్టి క్రేజ్ ఆడుకుంది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల ప్రభావంతో పెద్ద హీరోల సరసన అవకాశాలు పెద్దగా అందుకోలేకపోయింది. అయితే త్రిష లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

Producer Giridhar Allegations Against Trisha

తాజాగా త్రిష మళ్ళీ పెద్ద హీరోల సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఆమెకు ఇప్పుడు టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. పొన్నియన్ సెల్వన్, లియో వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన త్రిష ఇప్పుడు వెంకటేష్, చిరంజీవి వంటి హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది. అయితే త్రిష వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఓ పుకారు ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఆమె నిర్మాతల కష్టాలను పట్టించుకోకుండా ఎలా ప్రవర్తించేదో నిర్మాత గిరిధర్ మామిడిపల్లి వివరించారు. త్రిషపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read: Varsha Bollamma: యంగ్ హీరోతో ప్రేమలో పడ్డ వర్ష బొల్లమ్మ..?

బాలయ్యతో “లయన్” సినిమా చేస్తోన్న త్రిషను ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయమని అడిగాడు సదరు నిర్మాత. దానికి త్రిష కూడా ఒకే చెప్పిందట. అయితే చాలా కథలు పంపినా కానీ ఆమెకు అవి నచ్చలేదు. ఆఖరికి దర్శకుడు గోవర్ధన్ రెడ్డి ఓ హారర్ కథ చెప్పగా అది ఆమెకు నచ్చింది. షూటింగ్ వెంటనే ప్రారంభించగా ఆమెకు కొంత పారితోషకం కూడా ఫిక్స్ చేశారు. మొదట కొన్ని రోజులు చిత్రీకరణ సాఫీగా సాగింది. ఆ తర్వాత త్రిష, గోవర్ధన్ రెడ్డిల వల్ల నిర్మాతకు కష్టాలు మొదలయ్యాయి. సినిమాపై సరిగా దృష్టి పెట్టలేదు. సినిమా పూర్తవుతుండగానే బిజినెస్ పూర్తయ్యింది. ఈ చిత్రానికి 10 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది.

దీనితో త్రిష గొడవ చేయడం మొదలు పెట్టింది. 10 కోట్ల బిజినెస్ చేసుకుంటూ నాకు 1 కోటి కూడా ఇవ్వకుంటే ఎలా అని అడిగింది. అప్పట్లో త్రిషకి అంత మార్కెట్ లేదు. ఇప్పటికే పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలియదు. అందుకే అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వలేను కావాలంటే తమిళ శాటిలైట్ హక్కులను ఇస్తాము అని చెప్పారట. దానికి త్రిష ఒప్పుకోకపోవడంతో ఆమె కోరిన పరిహారం ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఇది నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. త్రిషతో సినిమా చేయాలనే ఆలోచన రావడంతో నా జీవితం మారిపోయింది. దీనికి కారణం దర్శకుడు, త్రిష అంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు త్రిష తమిళంలో ఒక చిత్రం చేసింది. అది కూడా డిజాస్టర్ కావడంతో నాయకి సినిమాపై ప్రభావం పడింది అని నిర్మాత గిరిధర్ అన్నారు.