IPL 2025: బాబర్ అజామ్ పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అనే సంగతి తెలిసిందే. తాజాగా బాబర్ ట్రోలింగ్ కు గురయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యంత పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన బాబర్ ఇప్పుడు పాకిస్తాన్ అభిమానుల ట్రోల్స్ కి గురవుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ విశ్లేషకుడు వాసే హబీబ్ మరో అడుగు ముందుకేసి బాబర్ అజాం ఐపీఎల్ వేలం మొత్తాన్ని అనౌన్స్ చేశాడు. IPL 2025

Babar Azam wonot be bought even for Rs100 in IPL

బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 4 ఇన్నింగ్స్ లో 64 పరుగులు మాత్రమే బాబర్ చేశాడు. తన సొంత దేశంలో అత్యంత పేలవమైన బ్యాటింగ్ ను ప్రదర్శించిన బాబర్ అజం ఐపిఎల్ లో కనిపిస్తే రూ. 130కి కూడా వేలం వేయరంటూ క్రికెట్ విశ్లేషకుడు వాసే హబీబ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ధర రూ. 130 మాత్రమే ఉంటుందని అంటున్నారు. IPL 2025

Also Read: Shahid Afridi: పాక్ కుట్రలు…. సచిన్ బ్యాట్ తో ఆఫ్రిది సెంచరీ….?

ఇదే విషయంపై ట్రోల్ చేస్తున్నారు. కాగా, బాబర్ అజాం అత్యంత పేలవ ప్రదర్శన క్రికెట్ ప్రేమికుల ఆగ్రహానికి కారణం అవుతుంది. ఐపీఎల్ లో పాకిస్తాన్ ఆటగాళ్లకు ప్రవేశం లేదు. 2008లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ముంబై దాడుల నుంచి పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి నిషేధానికి గురవడం జరిగింది. ఇప్పటికీ కొనసాగుతుండడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపిఎల్ లో ఎక్కడ కూడా కనిపించడం లేదు. IPL 2025