ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 6 నుండి నిలిచిపోయిన టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్.టీవీ న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను (ఎంఎస్ వో) ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో.. ఆంధ్రప్రదేశ్ లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను న్యాయస్థానం ఖండించింది. తద్వారా న్యాయ వ్యవస్థ మన ప్రజాస్వామ్య సమాజానికి మూల స్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేసింది.

జూన్ 6 నుండి టీవీ9 తెలుగు, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్.టి.వి సహా పలు న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ ఔట్ కావడం పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకత్వంలో మార్పు కారణంగా ఈ వార్తా ఛానళ్లను బ్లాక్ ఔట్ చేయాలని కేబుల్ ఆపరేటర్లందరిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టెలివిజన్ వినియోగదారుల పరంగా ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద మార్కెట్, ఇక్కడ సెట్ టాప్ బాక్స్ ద్వారా దాదాపు 65 లక్షల మంది వార్తలను వీక్షిస్తారని అంచనా. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్తా ఛానెళ్లు కనీసం 62 లక్షల బాక్స్ లు నుండి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరిగింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన నిబంధనల ప్రకారం. ఛానెల్స్ ను డిస్ కనెక్ట్ చేయడం చట్టవిరుద్ధమని, పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉందని ఢిల్లీ హైకోర్టులో టీవీ9 పిటిషన్ దాఖలు చేసింది.
ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు ఆసక్తి ఉన్న వార్తా ఛానెళ్లను వీక్షించే హక్కుని కొనసాగుతుందని నిర్ధారిస్తూ అనధికారికంగా నిలిపివేయబడిన వార్తా చానెళ్లను పునరుద్దరించాలని ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.

న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ ఈ నిర్ణయానికి మద్దతునిస్తూ, కోర్టు ఆదేశాలను తక్షణమే పాటించాలని సంబంధిత అధికారులందరికీ విజ్ఞప్తి చేసింది. దేశవాప్తంగా పత్రికా స్వేచ్ఛను ,జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడానికి ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని మేం నమ్ముతున్నామని తెలిపింది.
“రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో, స్వేచ్ఛ, స్వతంత్ర మీడియాను ప్రోత్సహించడంలో ఢిల్లీ హైకోర్టు నిబద్ధతను అభినందిస్తున్నాం. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి ఒక విజయం, మన ప్రాథమిక స్వేచ్ఛలను పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ పోషించే కీలకపాత్రను గుర్తుచేస్తుంది. న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ జర్నలిస్టుల హక్కులు, సమాచార స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు అవసరమైన న్యాయ పోరాటం చేసూానే ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి బ్లాక్ ఔట్ లను నివారించడానికి , మీడియా ఛానెల్ లు అనవసరమైన జోక్యం లేకుండా పనిచేసేలా చూసుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నియంత్రణ సంస్థలను కోరుతున్నాం’’ అని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ పేర్కొంది