Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వరుసగా కష్టాలు ఎదురయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ పార్టీ నాలుగు పార్లమెంటు స్థానాలని దక్కించుకోగలిగింది. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి షాకులు తప్పడం లేదు. Vidadala Rajini

vidadala rajini good bye to jagan

జగన్మోహన్ రెడ్డి పైన కొంతమంది అలిగి.. బయటికి వెళ్తుంటే.. మరి కొంతమంది రాజకీయ భవిష్యత్తు కోసం… పాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది నేతలు వైసిపికి రాజీనామా చేసి… కూటమి పార్టీల వైపునకు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ లిస్టులో విడదల రజిని కూడా చేరిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. Vidadala Rajini

Also Read: Mudragada: వైసీపీకి ముద్రగడ గుడ్ బై ?

త్వరలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో పాటు… రజనీ కూడా పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రహస్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరియు రజిని సమావేశం నిర్వహించారట. చిలకలూరిపేట నియోజకవర్గంలో తనకు టికెట్ ఇవ్వకుండా గుంటూరుకు తనను పంపించారని జగన్ మోహన్ రెడ్డి పైన విడదల రజిని అలిగారట. అందుకే తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం వైపు రజిని చూస్తున్నారని సమాచారం. Vidadala Rajini