Mp Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… రాజకీయాలు బాగా వేడెక్కాయి. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… పెద్దిరెడ్డి కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేస్తోంది. అనవసర కేసులను పెద్దిరెడ్డి కుటుంబం పైన పెట్టి చంద్రబాబు సర్కార్ ఒక ఆట ఆడుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Mp Mithun Reddy

Mp Mithun Reddy resign to mp post

త్వరలోనే పుంగనూరు నియోజకవర్గం పునర్విభజన లో భాగంగా రెండు నియోజకవర్గాలుగా మారే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పుంగనూరు నియోజకవర్గం రెండుగా చీలితే.. ఒక నియోజకవర్గ నుంచి తాను కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి. పుంగనూరు నియోజకవర్గాన్ని తమ కుటుంబం అస్సలు.. విడిచి పెట్టదని వెల్లడించారు.

Also Read: Revanth Reddy: హైదరాబాద్ ను డ్యామేజ్ చేస్తున్న రేవంత్.. అమరావతి కోసమేనా ?

పుంగనూరు తమ కుటుంబానికి అన్నం పెట్టిందని.. ఎన్ని కష్టాలు వచ్చినా పుంగనూరును మాత్రం వదలబోమని తెలిపింది. ఇది ఇలా ఉండగా 2014 2019 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిథున్ రెడ్డి వరుసగా ఎంపీగా విజయం సాధించారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి విజయం సాధించడం జరుగుతుంది. మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా.. బిజెపి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని… దారుణంగా ఓడించి మూడోసారి ఎంపిక విజయం సాధించారు మిథున్ రెడ్డి.