Poonam Kaur: చాలారోజులుగా టాలీవుడ్ సినిమాపరిశ్రమలో రగులుతున్న వివాదం పూనమ్ కౌర్. సినిమాలు చేసినవి తక్కువే అయినప్పటికీ పూనమ్ కౌర్ వివాదాలతోనే ఎక్కువ ఫేమస్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఆమెకున్న వివాదం ఆమెను ఎవరు మర్చిపోకుండా చేస్తుంది. ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఆమె తనకు అన్యాయం చేసిన వారికి ఏకిపారేస్తూనే ఉంటుంది. గతంలో త్రివిక్రమ్ పైన ఎన్నో రకాల విమర్శలు చేసింది. కానీ వాటిపై ఎవరూ చర్యలు తీసుకోలేదు. ఇక తాజాగా జానీ మాస్టర్ వివాదం సీరియస్ అవుతున్న నేపథ్యంలో ఆమె మరోసారి తన ట్విట్టర్ ఖాతాకు పనిచెప్పింది.

Poonam Kaur Questions ‘MAA’ Response on Trivikram

పూనమ్ కౌర్ చాలా కాలంగా త్రివిక్రమ్‌పై తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు చేస్తూనే వస్తున్నారు. త్రివిక్రమ్ తాను ఏ రీతిలో మోసం చేశారో చెప్తూనే వచ్చింది. అయితే ఇప్పుడు జానీ మాస్టర్‌పై నమోదు అయిన కేసు నేపథ్యంలో దాన్ని టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ అడ్రెస్ చేసిన నేపథ్యంలో పూనమ్ కౌర్ త్రివిక్రమ్ గురించి మరోసారి మాట్లాడారు. అలాగే ఛాంబర్‌పైనా విమర్శలు చేశారు. ఈరోజు ఉదయం ఫిలిం ఛాంబర్ కదిలివచ్చి జానీ మాస్టర్ కేస్ పై తాము కూడా సీరియస్ గా ఉన్నామని చెప్పింది.

Also Read: Jani Master: జానీ మాస్టర్ బాగోతం బయటపడడానికి కారణం ఆ హీరోనేనా!!

అయితే పూనమ్ “మా” అసోసియేషన్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నేను చేసిన ఫిర్యాదు స్వీకరించి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేసి కాదని ఆమె వెల్లడించింది. అప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకుని ఉంది ఉంటే తమకి ఈ రాజకీయ బాధలు అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు.తన ఫిర్యాదుపై ఎటువంటి స్పందన లేదు, అస్సలు పట్టించుకోలేదన్నారు. నేను ‘మా’ పెద్దలకు ఫోన్ చేసినా స్పందించలేదు అన్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోని పెద్దలు త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని కోరుతున్నాను అని ఆమె కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.

మరి దీనిపై ‘మా’ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. వివాదాస్పద నటి పూనమ్ కౌర్ మళ్ళీ ఈ విషయాన్నీ ఎంత దూరం తీసుకుపోతుందో చూడాలి. గతంలో ఎన్ని సార్లు ఈ విషయాన్ని ఎవరు పరిష్కరించలేదు. ఇప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందా అనేది చూడాలి. త్రివిక్రమ్ పెద్ద దర్శకుడిగా ఉండగా ఇప్పుడు చేతిలో సినిమాలేవీ లేక పూనమ్ ఫేడవుట్ అయ్యింది.