Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పై ఏపీ రాజకీయాలు చాలా వేడెక్కాయి. తిరుమల లడ్డు ప్రసాదంలో… జంతువుల కొవ్వు కలిపారని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో…ఈ వివాదం గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. అంతేకాదు ఈ వివాదం దేశాన్నిచుట్టేయడం జరిగింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ ఈ అంశం పైన స్పందిస్తున్నాయి. Tirumala Laddu

Bhumana oath on Tirumala Laddu allegations Chandrababu

ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి కూటమి పార్టీలు ఏకమై దాడి చేస్తున్నాయి. లేటెస్ట్ గా జగన్ ఇంటికి బిజెపి జెండాలు కూడా కట్టి నిరసన తెలిపారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీ సంచలన నిర్ణయానికి తెరలైపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశంపై తిరుమల శ్రీవారి సమక్షంలోనే ప్రమాణం చేశారు. Tirumala Laddu

Also Read: Bandi Sanjay: ఒవైసీ కాలేజీలో ఉగ్రవాదులు ?

తమ ప్రభుత్వం తిరుమలలో కల్తీ చేస్తే… తమ కుటుంబం నాశనం అవుతుందని..తిరుమల శ్రీవారు తమపై శిక్ష వేస్తాడని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తిరుమల సాక్షిగా ప్రమాణం చేసి.. తిరుమల క్షేత్రంలో స్నానం కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు కూడా తమలాగా తిరుమల సాక్షిగా ప్రమాణం చేయాలని.. సవాల్ విసిరింది వైసిపి. మరి దీనిపై.. చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. Tirumala Laddu