Tirumala Laddu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు వివాదం కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డులో… బీఫ్ కలుపుతున్నారని…గత నాలుగు రోజులుగా వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయిందని స్వయంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. Tirumala Laddu

bjp subramanian swamy On Tirumala Laddu Over jagan

దీంతో గత నాలుగు రోజులుగా వైసిపి పార్టీని జనాలందరూ… ఏకిపారేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా… ఈ విషయంపై స్పందించి జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నాయి. తక్కువ ధరకు నెయ్యి… జంతువులకు సంబంధించిన కొవ్వును… టిడిపి నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపై… న్యాయ పోరాటానికి వైసీపీ సిద్ధమైంది.ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది వైసిపి పార్టీ. Tirumala Laddu

Also Read: Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. టీటీడీకి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఆఫర్..!

అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. బిజెపిలో ఉన్న నేతలు అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే.. బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి మాత్రం జగన్కు సపోర్ట్ గా నిలిచారు. చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. చంద్రబాబు నాయుడు ఆధారాలు లేకుండా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సుబ్రహ్మణ్యస్వామి… పేర్కొన్నారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. Tirumala Laddu