Karthi: టాలీవుడ్‌ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ప్రతి సినిమాతో బ్లాక్‌బస్టర్లు అందిస్తూ, ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. అతను ఇటీవల టాలీవుడ్‌కు హనుమాన్ రూపంలో భారీ సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు, అలాగే రాబోయే రోజుల్లో తన సినిమాటిక్ యూనివర్స్‌లో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లను తీసుకువస్తానని హామీ ఇచ్చాడు.

Prashanth Varma Teams Up with Karthi

ఈ క్ర‌మంలో ప‌లు స్టార్స్ ఈ ప్రాజెక్ట్‌ల్లో భాగం కానుండగా, ఇప్పుడు మరో ప్రముఖ హీరో కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ విశ్వంలో చేరడం ఖాయమైంది. ఆ హీరో ఎవరో కాదు, ప్రముఖ తమిళ నటుడు కార్తీ అని ప్రశాంత్ వర్మ స్వయంగా వెల్లడించారు.

Also Read: PrakashRaj: పోయి.. ట్వీట్ చూసుకో.. పవన్ కు ఘాటైన రిప్లై ఇచ్చిన ప్రకాష్ రాజ్!!

అయితే, కార్తీతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. మరోవైపు, కార్తీ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించడానికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌తో ఎలాంటి చిత్రం రాబోతోందో చూడాలి. ఈ క్రమంలో, కార్తీ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా “సత్యం సుందరం” ఈ నెల 28న తెలుగులో విడుదల కానుంది.