Pawan Kalyan: గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి దేశవ్యాప్తంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ లడ్డూ ప్రసాదం యొక్క విషయాన్నీ టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా తీసుకున్నాడు.

Karthi Issues Apology to Pawan Kalyan Over Tirupati Laddu

అయితే ఈ సీరియస్ వాతావరణంలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన తెలుగు సినిమా సత్యం సుందరం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ ‘లడ్డూ గురించి ఇప్పుడు మాట్లాడకండి, ఇది చాలా సున్నితమైన విషయం’ అని చమత్కరించారు. దీనిపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నటుడిగా గౌరవం ఇస్తానని, లడ్డు ప్రసాదాన్ని ఎగతాళి చేస్తే మాత్రం సహించేది లేదన్నారు.

Also Read: Kill: తెలుగు బాలీవుడ్ సూపర్ హిట్ ‘కిల్’ సినిమా.. ఇలా చూసేయండి!!

దీంతో ఈ విషయంపై కార్తీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పడం వైరల్ గా మారింది. డియర్ పవన్ కళ్యాణ్ గారు.. మీరంటే నాకు చాలా గౌరవం.నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి, శ్రీ వేంకటేశ్వరుని భక్తుడిగా మన సంప్రదాయాన్ని గౌరవిస్తాను. దీంతో కార్తీ పవన్‌పై పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో క్షమాపణలు చెప్పడంతో కార్తీ ఇష్యూ సద్దుమణిగినట్లే అనుకోవాలి.