Savitri: బాలనటిగా 100కి పైగా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది హీరోయిన్ సులక్షణ. ఆమె గురించి ప్రస్తావించగానే గుర్తుకు వచ్చే చిత్రం “శుభోదయం.” తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా ఆమె నటించింది. తెలుగులో చంద్రమోహన్‌తో కలిసి ఆమె చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్న సులక్షణ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సావిత్రి’ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Sulakshana Talks About Her Bond with Savitri

“బాలనటిగా అప్పటి స్టార్స్ అందరితో కలిసి నటించాను. వారు నన్ను ఎంతో గౌరవంగా చూస్తుండేవారు. అందువల్ల, ఎస్వీఆర్, సావిత్రిగారి వంటి వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సావిత్రి గారి చివరి రోజులలో ఆమెను చూడాలనుకున్నాను. ఆమెను చూడాలనుకుంటున్నాను అని జెమినీ గణేశన్ గారిని అడిగాను. అడ్రస్ కనుక్కొని, సావిత్రి గారి ఇంటికి వెళ్లాను. అది ఒక పాత ఇల్లు, బూజులు పట్టి ఉంది, ఫ్యాన్ కూడా లేదు” అని ఆమె తెలిపింది.

Sulakshana Talks About Her Bond with Savitri

Also Read: MUDA case Siddaramaiah: సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ.. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి?

“సావిత్రి గారు భారీ ఖాయం ఉన్న వ్యక్తి. ఐదేళ్ల చిన్న పాపలా ఆమె ముడుచుకుపోయారు. ఆమె ఒళ్లంతా ట్యూబ్స్ పెట్టారు. చాలా క్షీణంగా తయారయ్యారు. ఆమెను చూసుకోవడానికి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ స్థితిలో నేను సావిత్రిగారిని చూడలేకపోయాను. ఎంతోమందికి ఎన్నో దానధర్మాలు చేసిన ఆమెను ఇంత క్షీణంగా చూడటాన్ని తట్టుకోలేకపోయాను. ఆమె చేసిన దానధర్మాలు వలన ఆమె తప్పకుండా స్వర్గానికి వెళ్ళుతారని భావిస్తున్నాను” అని సులక్షణ చెప్పింది.