Prabhas: తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం దర్శకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో కలిసి కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ కూడా పెట్టారు. ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘యానిమల్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సందీప్ రెడ్డి వంగ, ‘స్పిరిట్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా మాత్రమే కాకుండా, విలన్‌గా కూడా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

Prabhas Takes Center Stage in Sandeep Reddy Vanga Spirit

ప్రభాస్ పూర్తిగా ‘స్పిరిట్’పై ఫోకస్ చేయబోతున్నాడట. ఈ సినిమా కోసం ప్రభాస్ తన మిగతా ప్రాజెక్ట్‌లను వాయిదా వేసి, ‘స్పిరిట్’పై పూర్తిగా దృష్టి పెట్టనున్నారత. ఇంటర్నేషనల్ స్థాయి ప్రాజెక్ట్ కావడంతో సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్నదానికంటే మరింతగా పెరిగిందని తెలుస్తోంది.

Also Read: Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం పై కేసీఆర్ మౌనమేల.. ఆ ఒప్పందమే కారణమా?

సందీప్ రెడ్డి వంగ స్టైల్ లోనే ఈ సినిమాలోనూ హై వైలెన్స్ ఉంటుందని అంచనా. ప్రేక్షకుల ఆసక్తి కూడా అదే స్థాయిలో ఉంది. ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘యానిమల్’ సినిమాలను ఇష్టపడిన ప్రేక్షకులు ‘స్పిరిట్’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ మరియు ప్రభాస్ కలయిక మరో మాస్ మాజిక్‌ను సృష్టిస్తుండా చూడాలి.

ఇకపోతే సోషల్ మీడియాలో ‘స్పిరిట్’ సినిమా గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ హీరోగా మరియు విలన్‌గా కనిపించబోతున్నారనే విషయం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. సందీప్ రెడ్డి వంగ మరియు ప్రభాస్ కలిసి చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇండియాను మాత్రమే కాకుండా, హాలీవుడ్‌ను కూడా ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.