Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వాదానికి జరుగుతుంది. లడ్డూ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకోనని పవన్ కల్యాణ్ హెచ్చరిక చేశారు. “తప్పు జరిగితే మాట్లాడకూడదా?” అని ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్‌కు సమాధానంగానే ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

Prakash Raj Counters Pawan Kalyan in Tirumala Laddu issue

దీనిపై ప్రకాశ్ రాజ్, విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని, తిరిగి వచ్చాక వివరంగా స్పందిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా, హీరో కార్తీ తాజా చిత్రం ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లడ్డూ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. దీనిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. దీంతో కార్తీ వెంటనే క్షమాపణ చెప్పి, తాను వేంకటేశ్వర స్వామి భక్తుడినని, సాంప్రదాయాలను గౌరవిస్తానని తెలిపారు.

Also Read: Harsha Sai: మత్తుమందు ఇచ్చి.. తండ్రి కొడుకులిద్దరూ.. హర్ష సాయి రాసలీలలు బట్టబయలు..?

కార్తీ క్షమాపణపై ప్రతిస్పందిస్తూ ప్రకాశ్ రాజ్, “చేయని తప్పుకు క్షమాపణ చెప్పించుకోవడంలో ఏమాత్రం ఆనందం ఉందో! జస్ట్ ఆస్కింగ్…” అంటూ పవన్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వివాదం సినీ వర్గాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.