Roja: దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తిరుమల శ్రీవారి లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగినట్లు సీఎం చంద్రబాబు కామెంట్స్ చేయడం జరిగింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని….అందులో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఆరోపణలపై స్పందిస్తూ బిజెపి, జనసేన, హిందుత్వ వాదులు విమర్శలు చేస్తున్నారు. Roja

Kirak Rp Controversol Comments On Roja

అయితే తిరుమల శ్రీవారి లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదని, కావాలని జగన్మోహన్ రెడ్డిని ఈ లడ్డు వివాదంలో ఇరికించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. అయితే ఈ లడ్డు కల్తీ వివాదానికి సంబంధించిన రిపోర్టు జూలైలో వస్తే సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు బయట పెట్టడం జరిగింది. దీంతో ఎప్పుడో వచ్చిన రిపోర్టును ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేసుకున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కావాలనే జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి ఇలా చేస్తున్నారంటూ వైసిపి నేతలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.

Also Read: Kodali Nani: తిరుమలలో చంద్రబాబుకు గుండు కొట్టించనున్న కొడాలి నాని?

ఈ నేపథ్యంలోనే తాజాగా లడ్డు వివాదంపై జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి స్పందించాడు. తిరుమల శ్రీవారి ఈ లడ్డు కల్తీ వివాదంలో వచ్చిన లాభంలో రోజాకు 15% వాట వచ్చినట్లు కిరాక్ ఆర్పి కామెంట్లు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందకు వంద శాతం లడ్డు కల్తీ జరిగిందని ఆర్పి ఆరోపణలు చేస్తున్నారు ఈ లడ్డు కల్తీ విధానంలో రోజా పాత్ర కూడా ఉందంటూ కిరాక్ ఆర్పి సంచలన కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా…. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రోజా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండకుండా రోజా తమిళనాడులో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.