ప్రకాష్ రాజ్ కోసం పవన్ భారీ ప్లాన్

Prakash Raj: ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లతో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన చేసిన “గెలిచే ముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?” అనే ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన ఈ ట్వీట్ ద్వారా ఎవరిని ఉద్దేశించారనే చర్చ జోరుగా సాగుతోంది.

Pawan Kalyan Warns Prakash Raj Over Controversial Tweets

ఇంతకుముందు తిరుమల లడ్డూ వివాదంపై చేసిన వ్యాఖ్యల కారణంగా ప్రకాష్ రాజ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ భారతీయ జనతా పార్టీ యువజన విభాగం కార్యకర్తలు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన తెలిపారు. ప్రకాష్ రాజ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆయనను ‘మా’ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

Also Read: Devara: దేవర సినిమా విషయంలో భారీ మోసం.. అందుకే ఆ కఠిన నిర్ణయం!!

తనపై వస్తున్న విమర్శలకు ప్రతిస్పందిస్తూ ప్రకాష్ రాజ్ తాను భారతదేశానికి వచ్చి సమాధానాలు చెబుతానని అన్నారు. అయితే, ఆయన వరుస ట్వీట్లు చేస్తూ, తన వ్యాఖ్యల అర్థాన్ని స్పష్టం చేయకుండా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ప్రకాష్ రాజ్ మధ్య వాగ్వాదం జరుగుతోంది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అయితే, ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రకాష్ రాజ్ తన ట్వీట్ల ద్వారా సృష్టిస్తున్న ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా, ప్రకాష్ రాజ్ తన ట్వీట్ల ద్వారా ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.