Roja: జగన్‌ తిరుపతి పర్యటనపై మాజీ మంత్రి రోజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలను మోసం చేసినట్టు స్వామి వారిని మోసం చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమే అంటూ ఆగ్రహించారు. జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని తెలిపారు రోజా. భయపడలేదు కాబట్టే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మతం మానవత్వం అని చెప్పారని మాజీ మంత్రి రోజా పేర్కొనడం జరిగింది. బైబిల్ చదువుతారని ఇతర మతాలను గౌరవిస్తారని జగన్ చెప్పారన్నారు మాజీ మంత్రి రోజా. Roja

Roja About jagan Over Tirumala

చంద్రబాబుకు దేవుడు అంటే భయం భక్తి రెండు లేవని చురకలు అంటించారు. ప్రశాంతమైన వాతావరణంలో జగన్ దేవుని దర్శించుకుందామని వస్తే కూటమనేతలో దాడులు చేస్తామని హెచ్చరించారని తెలిపారు మాజీ మంత్రి రోజా. వైసీపీ నేతలు అందర్నీ హౌస్ అరెస్టు చేసి నోటీసులు ఇచ్చారన్నారు మాజీ మంత్రి రోజా. ప్రశాంత వాతావరణం లేదు కనుక జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని వివరించారు మాజీ మంత్రి రోజా. Roja

Also Read: Tirumala Laddu: లడ్డూ పంచాయితీలో హీరోలు.. తెలివిగా వ్యవహరించిన రజినీ!!

వైయస్ 5 సార్లు జగన్ 5 సార్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు మాజీ మంత్రి రోజా. ఈ రోజు కాకపోతే రేపైనా స్వామివారిని ఒక భక్తుడిలా జగన్ దర్శించుకుంటారని స్పష్టం చేశారు. కానీ డిక్లరేషన్ పేరుతో మీరు చేస్తున్న రాజకీయం ప్రజలు గమనిస్తున్నారన్నారని చెప్పడం జరిగింది. ఇన్నాళ్లు కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. మీకు దేవుడే బుద్ధి చెబుతాడని హెచ్చరించారు మాజీ మంత్రి రోజా. Roja