Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ మధ్య వార్ కొనసాగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ ను జనసేన నాయకులు చాలా వేధిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ నిలదొక్కుకొని వర్మ చేస్తున్నారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో వర్మను టార్గెట్ చేసి జనసే నాయకులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై రెవెన్యూ తీర్చుకునేందుకు వర్మ స్కెచ్ వేసినట్లు సమాచారం. Pithapuram

pithapuram varma big sketch on pawan kalyan

ఇందులో భాగంగానే… పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో… జనసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను పెట్టారట వర్మ. ఐదుగురు డైరెక్టర్ పదవులకు… జనసేన అలాగే టిడిపి నేతలు బరిలో నిలబడ్డారు. అటు ఈ పోటీ నుంచి వైసిపి తప్పుకుంది. వర్మ తరఫున కొంతమంది టిడిపి నాయకులు అలాగే అటు జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస తరపున మరికొంతమంది నేతలు ఈ బరిలో ఉన్నారు. Pithapuram

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉంది.. కూల్చేయండి ?

అంటే ఐదు డైరెక్టర్ పోస్టులకు ఏకంగా 12 మంది అభ్యర్థులు ఉన్నారన్నమాట. కూటమిలో ఉన్న జనసేన అలాగే తెలుగుదేశం పార్టీలు ఏకగ్రీవం చేసుకోవాల్సిన ఈ పదవుల కోసం ఎన్నికలకు వెళ్తున్నాయి. దీంతో అందరి చూపు పిఠాపురం నియోజకవర్గమైన పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వర్మ కు సంబంధించిన నేతలే విజయం సాధించి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ కు షాక్ తప్పదని చెబుతున్నారు. Pithapuram