NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ చేయబోయే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ని సినిమా పై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు సమాజం కోసం పోరాడే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ కథ గతంలో వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమాకు దగ్గరగా ఉన్నా, ప్రశాంత్ నీల్ దృష్టిలో దీన్ని మరింత గ్రాండ్ గా చిత్రీకరించాలని భావిస్తున్నారు.

Jr. NTR to Play Bangladeshi Freedom Fighter in New Film

ఈ చిత్రంలో ఎన్టీఆర్ యొక్క యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రశాంత్ నీల్, తన గత చిత్రాలకు పనిచేసిన బృందాన్ని ఈ చిత్రానికి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. రవిబస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Also Read: Madhubala: ఇండస్ట్రీ లోకి రానున్న మధుబాల కుమార్తెలు.. వారు ఎంత అందంగా ఉన్నారో చూడండి!!

ఎన్టీఆర్ ఇటీవల ‘దేవర’ సినిమాతో మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన, ఈ కొత్త చిత్రానికి త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు. 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేసే లక్ష్యంతో, బంగ్లాదేశ్ నేపథ్యం కలిగిన ఈ పీరియాడిక్ డ్రామా ఎంత విజయాన్ని అందుకుంటుందో చూడాలి.