Soundarya: సౌందర్య ప్రస్తుతం మన ముందు బతికి లేక పోయినప్పటికీ ఆమె సినిమాల రూపంలో ఎప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సౌందర్య సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే అలాంటి సౌందర్య వందకి పైగా సినిమాల్లో చేసి ఎన్నో ఆస్తులు కూడబెట్టింది. ఇక ఈమె చనిపోయాక ఈమె ఆస్తిని తల్లి అలాగే భర్త ఇద్దరు పంచేసుకున్నట్టు వార్తలు వినిపించాయి.
A star hero who took Soundarya property
అయితే సౌందర్య కంటిమీద కునుకు లేకుండా సంపాదించిన ఆస్తి సౌందర్య భర్త పెళ్లి చేసుకున్న రెండో భార్య అనుభవించింది అనే టాక్ కూడా వినిపించింది. సౌందర్య సంపాదించిన డబ్బుతో ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా స్థిర చరాస్తులు ఎన్నో కొనుగోలు చేసిందట. అయితే సౌందర్య చనిపోయాక ఈమె ఆస్తిపై ఓ హీరో ఫ్యామిలీ కన్నేసి ఆస్తి మొత్తం తమ పేరు మీదికి కన్వర్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(Soundarya)
Also Read: Nikhil: నిఖిల్ మామూలోడు కాదు..పెళ్లికి ముందే ఆ హీరోయిన్ తో అన్నీ కానిచ్చాడా..?
మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే మంచు మోహన్ బాబు అని ప్రస్తుతం మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సౌందర్య బతికున్న సమయంలో హైదరాబాద్ శివార్లలో శంషాబాద్ మున్సిపాలిటీలోని జలపల్లి లో దాదాపు 6 ఎకరాల్లో ఓ భవనాన్ని నిర్మించుకుంది.
కాని సౌందర్య మరణించాక తన పలుకుబడిన ఉపయోగించి మోహన్ బాబు ఆ లగ్జరీ ఇల్లుని తన పేరు మీదికి మార్చుకొని మంచు టౌన్ షిప్ అనే పేరు కూడా ఆ భవనానికి పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మీడియాలో వినిపించే వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారడంతో చాలామంది ఈ విషయం గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు.(Soundarya)