Pushpa2: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ద రైజ్’ సినిమా సృష్టించిన సంచలనం ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఈ హైప్ ‘పుష్ప: ద రూల్’ సీక్వెల్‌పై అంచనాలను ఆకాశాన్ని అంటిస్తోంది. ఈ క్ర‌మంలో, మేకర్స్ ఈ అంచనాలకు తగ్గట్లుగా తీవ్ర కృషి చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలిపారు. కొన్ని సన్నివేశాలను పలుమార్లు చిత్రీకరించి, వాటిని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.

Pushpa2: The Rule Set for Release on December 6

డిసెంబర్ 6న సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో, మేకర్స్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్లైమాక్స్ కోసం మేకర్స్ ఇప్పటికే రెండు వెర్షన్‌లను తీశారు, ప్రస్తుతం మూడో వెర్షన్‌ను అత్యంత గోప్యంగా రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్ మరియు ఫహద్ ఫాజిల్ మధ్య జరిగే ఈ క్లైమాక్స్ సన్నివేశాలు సినిమా కోసం హైలైట్‌గా నిలవబోతున్నాయి.

Also Read: Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలు.. వివాదం అనంతరం గవర్నర్ ని కలిసిన నాగార్జున!!

ఈ సినిమాలో రష్మిక మందన్న, సునీల్, అనసూయ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు, మరియు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప: ద రూల్’ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మేకర్స్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను దద్దరిల్లిస్తారని అంచనా వేస్తున్నారు.