Prabhas: ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. కొన్ని కారణాల వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది, కానీ ఇప్పుడు ప్రభాస్ రెగ్యులర్ డేట్స్ ఇస్తుండటంతో పనులు వేగంగా సాగుతున్నాయి.
Prabhas RajaSaab Nears Completion of Shoot
యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. దర్శకుడు మారుతి నవంబర్ నాటికి షూటింగ్ పూర్తికావాలని ఆశిస్తున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చవ్వనుందని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో ఎంతో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రత్యేకంగా లుంగీ లుక్లో తన అభిమానులను ఆశ్చర్యపరిచారు.
Also Read: Congo Lake Accident: భారీ పడవ ప్రమాదం.. కళ్ళముందే 78 మందికి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి..
‘రాజాసాబ్’లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్తో పాటు మరో నటి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఒక థియేటర్లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ షూటింగ్ పూర్తయితే, సినిమా విడుదలకు తుది దశలోకి వెళ్లడం ఖాయం అని యూనిట్ సభ్యులు వెల్లడించారు.
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల అనంతరం, ‘రాజాసాబ్’ సినిమాపై దృష్టి పెట్టాడు. ‘రాజాసాబ్’ తర్వాత ‘ఫౌజీ’ మరియు ‘సలార్ 2’ సినిమాల షూటింగ్ జరగబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.