Pawan Kalyan: ప్రఖ్యాత నటుడు షాయాజీ షిండే మరోసారి తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన ఆలయాల్లో ప్రసాదం కంటే మొక్కలు ఇవ్వడం ద్వారా భక్తులను ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములుగా చేయాలన్న ఆలోచనను ముందుకు తెచ్చారు. ఈ ఆలోచనను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ముందు ప్రస్తావించాలని ఆయన కోరుతున్నారు.

Sayaji Shinde to Discuss Green Prasadam Initiative with Pawan Kalyan

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న “మా నాన్న సూపర్ హీరో” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో షాయాజీ ఈ ఆలోచన గురించి వివరించారు. తన తల్లి స్మారకార్థం ప్రతి సంవత్సరం ఆమె బరువుకు సమానమైన విత్తనాలను నాటుతున్నట్లు చెప్పారు. ఈ విధంగా ప్రకృతికి తన వంతు సహకారం అందిస్తున్నానని చెప్పారు. ఈ ఆలోచనతో ఆయన చెట్లు నాటడం ద్వారా సమాజానికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.

Also Read: Tollywood Mega Heroes: వరుస మెగా హీరోల సినిమాలు.. మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్!!

మహారాష్ట్రలోని కొన్ని ఆలయాల్లో షాయాజీ ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భక్తులు అభిషేకం చేసిన తరువాత వారికి ప్రసాదం రూపంలో మొక్కలను అందిస్తున్నారు. ఈ మొక్కలను నాటితే అవి చెట్లుగా పెరిగి మనకు నీడ, పూలు, పండ్లు అందిస్తాయని, ప్రకృతిని రక్షించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ఆయన కోరిక. తన ఆలోచనను పవన్ కళ్యాణ్‌కి వివరించి, విస్తృతంగా అమలు చేయించాలని షాయాజీ ఆశిస్తున్నారు. ప్రతి వ్యక్తి ప్రకృతి పరిరక్షణలో భాగస్వామి కావాలని ఆయన కోరుతూ, ఈ ఆలోచన ద్వారా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.