Nizam Theatrical Rights of The Rajasab Sold for a Huge Price

The Rajasab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది ‘రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆశించినంత హైప్ లేదు అని చెప్పవచ్చు.

Nizam Theatrical Rights of The Rajasab Sold for a Huge Price

ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలను పెంచడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో ఇప్పటివరకు చేసినట్లుగా కాకుండా, పూర్తి కామెడీ మరియు మంచి డాన్స్ నెంబర్స్ ఉంటాయని అందరూ చెబుతున్నారు. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్‌లు అందిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Devara: పదిరోజుల ‘దేవర’ కలెక్షన్స్.. తగ్గేదేలే అంటున్న ఎన్టీఆర్!!

ఇక ది రాజాసాబ్ సినిమా నైజాంలో థియేట్రికల్ రైట్స్‌ను మైత్రి మూవీ మేకర్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నారు. మిగిలిన ఏరియా రైట్స్‌కు కూడా మంచి డిమాండ్ ఉందని తెలియజేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ది రాజాసాబ్ థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఐదు భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వనుంది. 400 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరగవచ్చని అంచనా వేస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నాడు, కాగా సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవంబర్ చివరికి షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. రొమాంటిక్, కామెడీ, హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ది రాజాసాబ్ రూపొందుతోంది.