Dhanush and Aishwaryaa Divorce on Kollywood

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. 2004లో వివాహం చేసుకున్న ఈ జంటకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2022లో విభేదాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ ఇద్దరు అప్పటి నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు.

Dhanush and Aishwaryaa Divorce on Kollywood

ఈ ఏడాది ఏప్రిల్‌లో కోర్టు వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 7న జరిగిన విచారణకు ధనుష్, ఐశ్వర్య హాజరుకాలేదు. దాంతో కోర్టు కేసును అక్టోబర్ 19కి వాయిదా వేసింది. ఈ గైర్హాజరు నేపథ్యంలో అభిమానుల్లో తిరిగి కలుసుకునే అవకాశాలపై ఆశలు మొదలయ్యాయి.

Also Read: The Rajasab: ప్రభాస్ అంటే అంతే….’ది రాజాసాబ్’ కు నైజాం లో భారీ రేటు!!

ధనుష్, ఐశ్వర్య విడాకుల వ్యవహారం వ్యక్తిగతమైనదైనా, ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కోర్టుకు హాజరుకాకపోవడం వెనుక గల కారణాలపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. వీరు విడాకుల కేసును వెనక్కి తీసుకుంటే అభిమానులు చాలా ఆనందిస్తారని భావిస్తున్నారు.

ధనుష్ ప్రస్తుతం కుబేర అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన రాయన్ చిత్రం విజయవంతం కావడంతో మంచి ఉత్సాహంలో ఉన్నారు. రాయన్ ఇచ్చిన స్ఫూర్తితో మరో చిత్రం ‘ఇడ్లీ బండి’ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీ లుక్ పోస్టర్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. ఐశ్వర్య కూడా సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది.