Anchor Shyamala: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు టాలీవుడ్‌ యాంకర్‌, వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో “జానీ”లు ఎక్కువయ్యారని మీడియా స‌మావేశంలో వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. పిఠాపురం నియోజక వర్గంలో ఓ చిన్నారిపై టీడీపీ కార్యకర్త జానీ అనే వ్యక్తి రేప్‌ చేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే…. ఈ సంఘటనపై టాలీవుడ్‌ యాంకర్‌, వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌ స్పందించి.. విరుచుకుపడ్డారు. ఏపీలో మహిళలపై రోజూ అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు టాలీవుడ్‌ యాంకర్‌, వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌.


Anchor Shyamala Slams Pawan Kalyan

మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఇలా జరగడం దారుణమని మండిపడ్డారు. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా స్పందించ‌లేదని ఆగ్రహించారు. ముందే స్పందించి ఉంటే ఆ పాప బతికేది అని వ్యాఖ్యానించారు టాలీవుడ్‌ యాంకర్‌, వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌. గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారని ఆడపిల్లలు వాపోతే పట్టించుకోలేదని…. పైగా సెలవులు ఇచ్చి అందర్నీ పంపేశారని ఆగ్రహించారు టాలీవుడ్‌ యాంకర్‌, వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌. జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితే లేదని విమర్శలు చేశారు.

Also Read: Duvvada Srinivas: తిరుమలలో దువ్వాడ – మాధురి వెర్రి వేషాలు?

నన్ను అధికార ప్రతినిధిగా ఎంపిక చేశాక టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయని ఫైర్‌ అయ్యారు. దారుణంగా నా గురించి పోస్టులు పెట్టారని మండిపడ్డారు టాలీవుడ్‌ యాంకర్‌, వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌. టీడీపీ అఫీషియల్ గ్రూపులో నా గురించి జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారన్నారు. సినీ పరిశ్రమ నుంచి వస్తే అంత అలుసుగా ఎందుకు చూస్తున్నారు? అని పేర్కొన్నారు శ్యామల. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుండి రాలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అసలైన మహిళా శక్తి ఏంటో త్వరలోనే చూపిస్తామని హెచ్చరించారు టాలీవుడ్‌ యాంకర్‌, వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌.