Anchor Shyamala sensational comments

Shyamala: యాంకర్ శ్యామల కి రీసెంట్ గా వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక కీలకమైన పదవి దక్కింది.దీంతో ఆమె టిడిపి కూటమిపై రెచ్చిపోయి కామెంట్లు చేస్తోంది. అయితే రీసెంట్ గా వైఎస్ఆర్సిపి పార్టీ మహిళలపై టీడీపీ వాళ్ళు చేస్తున్న కామెంట్లపై తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ టిడిపి కూటమి వాళ్ళని ఏకీపారేసింది.. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకురాళ్లపై ఎన్నో అసభ్య కామెంట్లు చేస్తున్నారు నాపై కూడా ఎంతోమంది అసభ్య పోస్టులు పెడుతున్నారు.

Anchor Shyamala sensational comments

పిఠాపురంలో చాలామంది జానీలు పెరిగిపోతున్నారు.. రెచ్చి పోతున్నారు. రీసెంట్ గా పుంగనూరులో బాలిక అత్యాచార కేసులో పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అయి ఉంటే ఆ పాప బతికేది.ఇక గుడ్ల వల్లేరు కాలేజీలో అమ్మాయిల నగ్న వీడియోలు బయటపెట్టిన కూడా వారికి సెలవులు ఇచ్చేసి ఇంటికి పంపించేశారు. ఇప్పటికి కూడా దాని గురించి సరైన వివరాలు బయట పెట్టడం లేదు. పిఠాపురంలో జానీలు పెరిగిపోతున్నారు.(Shyamala)

Also Read: The Rajasab: ప్రభాస్ అంటే అంతే….’ది రాజాసాబ్’ కు నైజాం లో భారీ రేటు!!

ఎవరి భయం లేకుండా రెచ్చిపోతున్నారు. చాలామంది టిడిపి వాళ్ళు వాళ్ళ అఫీషియల్ గ్రూపుల్లో నామీద చాలా దారుణంగా కామెంట్లు,పోస్టులు పెడుతున్నారు.ఎన్నో అసభ్యమైన కామెంట్లు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుండి వస్తే అంత చిన్న చూపుతో చూస్తారా.. సినీ ఇండస్ట్రీ నుండి ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు. వారందరినీ ఇలాగే ట్రీట్ చేశారా..

Anchor Shyamala sensational comments

ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తుంది అనగానే ఎంతైనా ట్రోల్ చేస్తారా..టిడిపిలోకి సినీ ఇండస్ట్రీ నుండి బాలకృష్ణ, ఎన్టీఆర్, జయప్రద వంటి వాళ్ళు వచ్చారు కదా.. వైయస్ఆర్సీపీలోకి వస్తే మాత్రం తప్పా.. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినా కూడా ఎన్నో ఆకృత్యాలు పెరిగిపోయాయి. నేను ఈ విషయం గురించి మహిళల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను అంటూ యాంకర్ శ్యామల సంచలన కామెంట్లు చేసింది.(Shyamala)