Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన తన ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని ఫేమస్ ఆలయాలను దర్శిస్తూ తన తల్లి చీరకాల కోరికను నెరవేర్చినట్టు ఈ మధ్యనే ఒక పోస్ట్ పెట్టారు. తన తల్లికి ఎంతో ఇష్టమైన ఆలయానికి తీసుకువెళ్లారు.అలాగే కన్నడ స్టార్ అయినటువంటి రిషబ్ శెట్టి అలాగే ప్రశాంత్ నీల్ ని కూడా కలిసి వారితో టైం స్పెండ్ చేశారు. ఇక కర్ణాటక కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయమైన వస్త్రాల్లో దర్శనమిచ్చారు.
Balakrishna 50-year movie celebration that took away peace of mind from Jr.NTR
పట్టు పంచె కట్టుకొని కనిపించారు ఎన్టీఆర్ లుక్ కి చాలామంది ఫిదా అయ్యారు. అయితే ఎన్టీఆర్ కర్ణాటక కి వెళ్లడంతో అక్కడి మీడియా ఆయనతో మాట్లాడుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా మీరు ఆలయాన్ని సందర్శించారు కదా అక్కడికి వెళ్లాక దేవున్ని ఏమని కోరుకున్నారు అని మీడియా వాళ్ళు ఎన్టీఆర్ ని అడగగా.. మనశ్శాంతి అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం అందరినీ షాకింగ్ కి గురిచేస్తుంది. (Jr.NTR)
Also Read: Chiranjeevi: బాలకృష్ణతో చిరంజీవికి ఉన్న ఆ కోరిక తీరేదెన్నడో.?
ఎన్టీఆర్ ఎందుకు అలా అందరూ షాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చారు అని మాట్లాడుకుంటున్నారు.అయితే సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్టీఆర్ మాట్లాడిన మాట గురించి గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇక చాలామంది ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు పిలవకపోవడంతో ఆ డిప్రెషన్ లో ఉండిపోయారని, అందుకే ఆ వేడుక హైదరాబాదులో జరుగుతున్న వేళ తనని పిలవలేదు కాబట్టి హైదరాబాదులో ఉండకూడదని నిశ్చయించుకొని కర్ణాటక వెళ్లినట్టు తెలుస్తోంది.
అంతేకాదు బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు సొంత కుటుంబ సభ్యులైన కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ ను దూరం పెట్టడంతోఎన్టీఆర్ కి మనశ్శాంతి కరువైందని తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ మీడియాతో అలా మనశ్శాంతి కోరుకుంటున్నానని మాట్లాడి ఉండవచ్చునని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మనశ్శాంతి అనే ఆన్సర్ ఇచ్చాక ఆ తర్వాత అందరూ బాగుండాలని కోరుకున్నాను.. సర్వేజనా సుఖినోభవంతు అని కూడా చెప్పారు.(Jr.NTR)