Jani Master: జానీ మాస్టర్ వివాదం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది.ఇప్పటికే పరారీలో ఉన్న జానీ మాస్టర్ గోవాలో రెడ్ హ్యాండెడ్ గా హైదరాబాద్ ఎస్ఓటి పోలీస్ లకి పట్టుపడ్డాడు.దాంతో ఆయన్ని గోవా నుండి హైదరాబాద్ కు తరలించారు. ఇక ఈరోజు జానీ మాస్టర్ ని కోర్టులో హాజరు పరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక పోలీసులు కూడా తేల్చి చెప్పేశారు.
Jani Master wife is going to divorce
అయితే జానీ మాస్టర్ పోలీసులకు రెడ్డి హ్యాండెడ్ గా దొరకడంతో ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య సుమలత పేరు గట్టిగా వినిపించింది. కట్టుకున్న భార్య జానీ మాస్టర్ ని పట్టించింది అనే టాక్ కూడా వినిపించింది.ఇక ఎస్ఓటి పోలీసులకు జానీ మాస్టర్ పట్టుబడగానే జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కి వచ్చి రచ్చ రచ్చ చేసింది.అంతేకాదు మీడియా వారిపై మండిపడింది. (Jani Master)
Also Read: Jani Master: జానీ మాస్టర్ ని బెంగళూరులో పట్టించింది భార్యనేనా..?
నన్ను ఫోటోలు వీడియోలు తీస్తారా అంటూ విరుచుకుపడింది. అయితే తనకి ఎవరో ఫోన్ చేసి నీ భర్త నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని ఫేక్ కాల్ చేశారంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని మతం మార్చుకొని రెండో పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్, ఆయిన భార్య వేధించినందుకు గానూ లవ్ జిహాది కేసు నమోదు అవుతుం ది అంటూ ఇలా ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి.
అయితే ఈ విషయంపై జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ..నా భర్త పై లవ్ జిహాదీ అంటూ ఏవేవో వార్తలు రాస్తున్నారు. నా భర్తకి దేశం అంటే ఎంత ప్రాణమో ఈ వార్తలు రాసేవారికి తెలియదు ఆయన దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తారు. జానీ మాస్టర్ తప్పు చేసినట్టు నిరూపణ జరిగితే మాత్రం నేను ఆయనకి కచ్చితంగా విడాకులు ఇస్తా. అలాగే ఎవరైతే ఆ అమ్మాయి నా భర్త పై ఈ ఆరోపణలు చేసిందో అమ్మాయికి ఇప్పటికే ఎంతో మందితో ఎఫైర్లు ఉన్నాయి అంటూ జానీ మాస్టర్ భార్య సంచలన కామెంట్లు చేసింది.(Jani Master)