Lavanya: రాజ్ తరుణ్ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు చేసి నిజం అని నిరూపించిన లావణ్య తాజాగా మరొక సెన్సేషనల్ విషయం బయట పెట్టింది.తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్ కి కొన్ని స్లిప్పులు పట్టుకొని వెళ్లిన లావణ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ తర్వాత మీడియాతో సంచలన విషయం బయటపెట్టింది.
Lavanya: Raj Tarun stole my thali and gold secretly
అదేంటంటే.. రాజ్ తరుణ్ నా బంగారం మొత్తం ఎత్తుకెళ్లిపోయాడు. ఇప్పటికే రాజ్ తరుణ్ ని నాకు దూరం చేసింది. కనీసం ఆయన కట్టిన తాలైన నా దగ్గర లేకుండా తాళి, నా బంగారం అన్ని రాజ్ తరుణ్ ఎత్తుకెళ్లిపోయాడు.ఇంకా నన్ను ఏం చేద్దామని అనుకుంటున్నారు.. బీరువా తాళం రాజ్ తరుణ్ కి మాత్రమే తెలుసు. ఆయన దగ్గరే ఉంది. (Lavanya)
Also Read: Jayam Ravi: రోజు కారులోనే రొమా**.. జయం రవి సినిమాటిక్ లవ్ స్టోరీ..?
తీరా నిన్న సాయంత్రం 6 గంటలకు బీరువా తెరిచి చూస్తే అందులో ఒక్క నగ కూడా లేదు.పూర్తిగా రాజ్ తరుణ్ దొంగతనం చేశాడు. నగలకు సంబంధించిన జ్యువెల్లరీ షాప్ బిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి.నేను పూర్తి ఆధారాలతోనే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాను. ఇంకా నన్నేం చేయాలనుకుంటున్నారు అంటూ లావణ్య జువెలరీ బిల్ స్లిప్పులతో పోలీస్ స్టేషన్ కి వచ్చి రాజ్ తరుణ్ పై సంచలన కామెంట్స్ చేసింది.
అయితే మీడియా ముందు రాజ్ తరుణ్ తన బంగారాన్ని దొంగలించాడు అని చెప్పడంతో ప్రస్తుతం మీడియాలో ఈ మ్యాటర్ వైరల్ గా మారింది. అంతేకాదు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు రాజ్ తరుణ్ నిజంగానే దొంగనా.. హీరో అయ్యుండి బంగారం కొట్టేయడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Lavanya)