Naga Chaitanya and Sobhita Dhulipala: టాలీవుడ్ ప్రముఖ నటీనటులు నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల  ఎంగేజ్మేట్ ఘనంగా జరిగింది. గత కొన్ని నెలలుగా వీరిమధ్య వస్తున్న పుకార్లను వీరు నిజం చేశారు. వీరి నిశ్చితార్థ వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చైతన్య-శోభిత నిశ్చితార్థం ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబోయే దంపతులను అందరూ ఆశీర్వదించాలని కోరారు.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ తారలు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ నిశ్చితార్థం జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు? అప్పుడే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి బాంబు పేల్చారు. ఈ లవ్ బర్డ్స్ గురించి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం వేణు స్వామి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు గురూజీ ఎలాంటి బాంబు వేస్తాడోనని మాట్లాడుకుంటున్నారు. మరికొందరు స్పందిస్తూ.. ‘‘స్వామీజీ ఈ కొత్త జంటను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’’ అన్నారు. వేణు స్వామి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా వేణు స్వామికి ఇంత పేరు రావడానికి నాగ చైతన్య, సమంత కూడా కారణం. అందరూ ఆదర్శ జంటగా తయారవుతారని అనుకున్నప్పుడు, విడాకులు తీసుకుంటారని మొదట చెప్పింది ఈయనే. ఆ తర్వాత అది నిజమై వేణు స్వామి బాగా పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా ఆయన చెప్పిన జ్యోతిష్య అంచనాలు ఒక్కటి కూడా నిజం కాలేదు. దీంతో స్వామీజీపై ట్రోలింగ్స్ బాగానే జరిగేవి. మరి వీరి గురించి ఏం జ్యోతిష్కం చెబుతాడో చూడాలి.

నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..