Guntur Kaaram Failure: తెలుగు చిత్రసీమలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్న నాగవంశీకి ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన నిర్మించే సినిమాలు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, ఆయన మాట్లాడే తీరూ చాలా నిజాయితీగా, నిర్మొహమాటంగా ఉంటుంది. ముఖ్యంగా తన సినిమాలపై ఎప్పుడూ స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, నాగవంశీ తన నిర్మాణంలో వచ్చిన “గుంటూరు కారం” గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Producer Naga Vamsi Opens Up About Guntur Kaaram Failure

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతికి విడుదలైన “గుంటూరు కారం” సినిమాపై భారీ అంచనాలు ఉండగా, దాన్ని నిరూపించుకోలేకపోయింది సినిమా. ఈ విషయాన్ని అంగీకరించిన నాగవంశీ, సినిమాకు విజయవంతం కాకపోవడానికి గల కారణాలను వివరించారు. ఆయన మాటల్లో, “కమర్షియల్‌గా సినిమాను విజయవంతం చేసుకున్నాం, నైజాం ఏరియా మినహా అన్ని ప్రాంతాల్లో మంచి లాభాలు వచ్చాయి. సంక్రాంతి సీజన్ సమయంలో ప్రజలు హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవడం వల్లే నైజాం కలెక్షన్లు తగ్గాయి” అని తెలిపారు.

Also Read: Sukumar and Allu Arjun: ఆర్య సినిమా కోసం సుకుమార్ ముందుగా బన్నీ ని అనుకోలేదట!!

సినిమా కంటెంట్ విషయంలో తాను గట్టిగా నమ్మకం ఉంచినట్టు చెప్పారు. అయితే “గుంటూరు కారం” లాంటి మాస్ టైటిల్ పెట్టడం, ఫ్యామిలీ సినిమా అయినప్పటికీ అర్ధరాత్రి షోలను ప్లాన్ చేయడం వంటి కొన్ని తప్పుల్ని ఒప్పుకున్నారు. రివ్యూలు కూడా సరిగా రావడంలేదని, ప్రేక్షకుల అంచనాలు, దర్శకుని లక్ష్యం వేర్వేరు కావడం వల్ల ఈ పరిణామం జరిగిందని అభిప్రాయపడ్డారు.

సినిమా నిరాశపరిచినా, నాగవంశీ సినిమా కంటెంట్ పై తన నమ్మకాన్ని విడవలేదు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుండగా, ఆయన తదుపరి సినిమాలతో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం.