Shruti Haasan Sparks Controversy with Bold Comments

Shruti Haasan: నటి శృతిహాసన్ తన బోల్డ్ నటనతో పాటు, సాహసోపేత వ్యాఖ్యలతో కూడా పాపులర్. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తరచూ చర్చకు దారితీస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంటాయి. తాజాగా టిండర్ యాప్ ప్రమోషన్ కోసం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు, వాటిలో కొన్ని ప్రత్యేకంగా వివాదాస్పదమయ్యాయి.

Shruti Haasan Sparks Controversy with Bold Comments

ఈ ఇంటర్వ్యూలో, తన సినీ కెరీర్‌లో చాలా మంది హీరోలతో కలిసి పనిచేసానని, కానీ వారిలో చాలామంది తన కంటే పొట్టిగా ఉన్నారని అన్నారు. తన ఎత్తు 5.9 అడుగులని, కెమెరా ముందు హీరోలు సరితూగేలా నటించడానికి ఆపిల్ బాక్సుల మీద నిల్చోవాల్సి వచ్చిందని చెప్పి, “అందరూ ఆపిల్ బాక్సుల మీద నటించడానికి ఇష్టపడరు కదా” అని చేసిన వ్యాఖ్య వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్య పరోక్షంగా కొందరు హీరోలను టార్గెట్ చేసినట్లు అనిపించింది.

Also Read: Sneha Reddy: ఆ హీరోయిన్ అంటే అల్లు అర్జున్ వైఫ్ కి ఎందుకంత కోపం..కాపురంలో చిచ్చు!!

ఇంకా బోల్డ్ గా ముందుకు వెళ్లిన శృతి, “మనం వాళ్ల కింద పడుకున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడారు” అంటూ చేసిన వ్యాఖ్యతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి చేసిందో స్పష్టంగా తెలియకపోయినా, పలువురు హీరోలు, వారి అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నారు. ఫలితంగా, శృతిహాసన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

తన నిర్భయ స్వభావం కారణంగా శృతిహాసన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. మరికొందరికి ఆమె మాటలు నచ్చకపోయినా, తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. ఇదిలా ఉండగా, శృతి హాసన్ అడివి శేష్‌తో నటిస్తున్న “డెకాయిట్” సినిమా నుండి తప్పుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి, కానీ చిత్ర యూనిట్ ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.