Team India: టీమిండియా జట్టు ప్రపంచ కప్ విజేతగా మారిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన… టి20 ప్రపంచ కప్ ఫైనల్లో… టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసిన టీమిండియా…అనంతరం… టి20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్గా నిలిచింది. Team India

Team India with Prime Minister Modi densely populated Mumbai

ఇక… ఈ విజయం అనంతరం… గురువారం రోజున ఇండియాకు టీమ్ ఇండియా జట్టు చేరుకుంది. ఈ తరుణంలో… టీ 20 వరల్డ్ కప్ తో రోహిత్ సేన ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలిసింది. ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న టీమిండియా హోటల్లో ఫ్రెష్ అయ్యి ఆటగాళ్లు నేరుగా ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లారు. Team India

అక్కడ వారు గెలిచినటువంటి ట్రోఫీని సగౌరవంగా మోడీకి అందించారు. ఆ కప్ చూసినటువంటి మోదీ మురిసిపోయారు. టీమిండియా ప్రదర్శన పట్ల గర్వంగా ఉందంటూ ఉందని ఆయన అన్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ తో సహా మిగిలిన ఆటగాళ్లతో ప్రధాని మోదీ మాట్లాడారు. టీ20 వరల్డ్ కప్ విజయం…. ఆ విజయంతో 135 కోట్ల మందిలో నింపిన ఆనందాన్ని అందరూ కలిసి షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. Team India