Sridevi: శ్రీదేవి మరణం లోని మిస్టరీ ఇప్పటికి కూడా బయటపడలేదు.. అయితే బోనీకపూర్ తన భార్య మరణానికి కారణం కఠినమైన ఆహార నియమాలు అని, డైటింగ్ కారణంగా అప్పుడప్పుడు అన్ కాన్షియన్స్ లోకి వెళ్లిపోయేదని, అలా దుబాయ్ కి పెళ్లి కోసం వెళ్లిన సమయంలో కూడా స్నానం చేయడానికని బాత్ టబ్ లోకి దిగి అన్కాన్షియస్ లోకి వెళ్లిపోవడంతో అలాగే బాత్ టబ్ లో ఉన్న నీళ్లలో మునిగిపోయి చనిపోయింది అంటూ చెప్పేశాడు.
The mystery of Sridevi death.. Was it a mistake at birth
అయితే శ్రీదేవి మరణించిన సమయంలో చాలా రూమర్లు వినిపించాయి.శ్రీదేవి పేరు మీద 100 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని,ఇక శ్రీదేవి మరణిస్తే 100 కోట్లు వస్తాయనే ఉద్దేశంతో బోనీకపూరే ఈ పని చేశాడు అంటూ కూడా రూమర్స్ వినిపించాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. అయితే శ్రీదేవి మరణం లో ఆమె సొంత తప్పిదాలతో పాటు ఆమెకు జాతకంలో ఒక దోషం కూడా ఉందట. మరి ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం. (Sridevi)
Also Read: Sridevi: శ్రీదేవికి ఆ హీరోయిన్లంటే అంత కుళ్లా..ఆ రోజు ఏం చేసిందంటే..?
శ్రీదేవి మరణానికి కారణం ఆమె సొంత తప్పిదాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె చేసిన సొంత తప్పిదాలే చివరికి ప్రాణం మీదికి తీసుకువచ్చాయి.. అందరికంటే యంగ్ గా కనిపించడం కోసం తన శక్తికి మించి ఎక్కువ డైటింగ్ చేయడం, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం, తక్కువ ఆహారం తిని ఎక్కువ ఎక్సర్సైజులు చేయడంతో ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణమయ్యాయి. శ్రీదేవికి హై బిపి,హై డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా ఉండేవట.
అయితే మరొక రహస్యం ఏమిటంటే.. శ్రీదేవి పుట్టిన సమయంలోనే ఆమె జాతకం చూసిన జ్యోతిష్యుడు శ్రీదేవికి జలగండం ఉంది అని చెప్పారట. ఇక ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లే శ్రీదేవి జలగండం ద్వారానే చనిపోయింది. ఎందుకంటే ఆమె బాత్ టబ్ లో ఉన్న నీళ్లలో మునిగి చనిపోయింది.. అయితే శ్రీదేవికి చిన్నతనంలో జల గండం ఉంది అని తెలియగానే వాళ్ళ ఫ్యామిలీ చిన్నప్పుడే ఎన్నో హోమాలు, యజ్ఞాలు చేయించారట. కానీ బ్రహ్మ రాసిన రాత మాత్రం మారలేదు అంటారు కొంతమంది.(Sridevi)