Tirumala Laddu: ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటున్న విషయం ఏంటయ్యా అంటే తిరుమల లడ్డు.. వైసిపి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే లడ్డులో చేప నూనె, జంతువుల కొవ్వు కలిపి చేశారని నాసిరకమైన నెయ్యిని వాడారంటూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని లేవనెత్తింది. దీంతో తిరుమల లడ్డు చుట్టూ రాజకీయం నెలకొంది.అటు వైసిపి వాళ్ళు మేము ఎలాంటి తప్పు చేయలేదు దేనికైనా సిద్ధం అని అంటుంటే ఇది టిడిపి వాళ్లేమో నిజంగానే చేప నూనె, జంతు కొవ్వు కలిపారు అంటూ వివాదానికి తెరలేపారు.
The star hero who ran saying no Tirumala Laddu
దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ దేశం మొత్తం వ్యాపించింది.అలా దేశంలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ లడ్డు వివాదం పై స్పందిస్తున్నారు.అయితే తాజాగా ఈ విషయంపై స్పందించమని కోరగా నాకు లడ్డు గోల వద్దు బాబోయ్ అంటూ పరుగులు తీసినంత పని చేశారు నటుడు కార్తి.. కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగువారికి ఎంతో దగ్గరైనటువంటి కార్తీ ప్రస్తుతం సత్యం సుందరం అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. (Tirumala Laddu)
Also Read: Tirumala Laddu: చంద్రబాబుకు చిక్కులు…తిరుమల లడ్డు ఆరోపణలపై భూమన ప్రమాణం !
అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ లడ్డు కావాలా నాయనా అని అడగగా ప్రస్తుతం లడ్డు చుట్టూ వివాదం నెలకొన్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన కార్తీ ఆ విషయంలో స్పందించడానికి అస్సలు ముందుకు రాలేదు… అంతేకాదు ఇప్పుడు లడ్డు వద్దు ఏం వద్దు నేను ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేను..అది సెన్సిటివ్ టాపిక్ దాన్ని వదిలేయండి అంటూ చెప్పేశారు.
అయితే యాంకర్ మాత్రం వదలకుండా క్యాజువల్ గా నైనా ఈ విషయం గురించి స్పందించండి అని అడగగా.. అసలు లడ్డు వద్దు అంటూ గట్టిగా చెప్పేశారు. దీంతో అక్కడే ఉన్న వాళ్ళందరూ కార్తీ తిరుమల లడ్డు వివాదంలో వేలు పెడితే బాగుండదని ముందుగానే నిర్ణయించుకున్నారు కావచ్చు. అందుకే దాని గురించి స్పందించడానికి ఇష్టపడడం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Tirumala Laddu)