Mohammed Shami: టీమిండియా జట్టుకు అలాగే క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త అందింది. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు డేంజర్ బౌలర్. దాదాపు ఆరు నెలల తర్వాత… జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంతకీ ఆ డేంజర్ ఎవరో కాదు…. మహమ్మద్ షమీ. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహమ్మద్ షమీ బౌలింగ్ వేస్తే వికెట్లు విరగాల్సిందే. Mohammed Shami

Mohammed Shami resumes bowling, likely to make return in India vs Bangladesh Test series

అయితే దాదాపు ఆరు నెలలపాటు టీం ఇండియాకు షమీ దూరమై… ఇప్పుడు రియంట్రి ఇవ్వబోతున్నాడు. చీల మండల గాయం నుంచి పూర్తిగా కోల్కున్న మహమ్మద్ షమీ…టీమిండియా జట్టులో చేరబోతున్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అంటే ఎన్సీఏ బెంగళూరులో పునరావాసం పొందుతున్నాడు మహమ్మద్ షమి.Mohammed Shami

Also Read: Gautam Gambhir: కోచ్‌ గా గంభీర్‌…కోహ్లీ, రోహిత్‌ ఔట్‌..బీసీసీఐ ప్లాన్‌ ఇదే?

అయితే తాజాగా… ఎన్సీఏ అధికారులు నిర్వహించిన టెస్టుల్లో…మహమ్మద్ షమీ పాస్ అయ్యాడట. దీంతో మరికొన్ని రోజుల్లోనే… టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడ మహమ్మద్ షమీ.గాయం నుంచి కోల్కున్న షమీ… ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడట. సెప్టెంబర్ మాసంలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లేదా ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో సమీ ఆడబోతున్నట్లు సమాచారం. Mohammed Shami

ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అదరగొట్టిన మహమ్మద్ షమీ… ఆ తర్వాత జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్, టి20 ప్రపంచ కప్ నకు దూరమయ్యాడు. కాగా ప్రస్తుతం టీమిండియా టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంటులో అదరగొడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే సూపర్ 8 కు చేరిన టీమిండియా జట్టు…. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడనుంది. ఇందులో గెలిస్తే నేరుగా సెమిస్ పోరులోకి ఎంట్రీ కానుంది టీమిండియా జట్టు. Mohammed Shami