Ys Sharmila: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అన్న చెల్లెలు ఇద్దరి మధ్య… ఏం గొడవలు మొదలయ్యయో తెలియదు కానీ.. వీరిద్దరూ ప్రస్తుతం బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఆస్థి తగాదాల..లేక.. పదవుల పంపకాల తెలియదు కానీ.. గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ఎడమొహం పెడ మొహం లాగానే ఉంటున్నారు. Ys Sharmila

Jaganmohan Reddy and YS Sharmila getting together again

షర్మిల ఒక అడుగు ముందుకు వేసి.. తెలంగాణ రాష్ట్రంలో వైసిపి పేరుతో కొత్త పార్టీని కూడా నిర్మించారు. ఆ తర్వాత తెలంగాణలో బొక్క బోర్లపడడంతో… మళ్లీ ఏపీకి వచ్చేసారు షర్మిల. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసి… వైసిపి ఓటమికి షర్మిల కూడా ఒక కారణమయ్యారు. ఇలా పాము ముంగిసల్లాగా ఇద్దరు… పరోక్షంగా యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. Ys Sharmila

Also Read: Telangana: రేవంత్ సంచలనం…ఐరన్ లేడికి హోంశాఖ… పోచారం, రాజగోపాల్, వివేక్ లకు కీలక పదవులు?

అయితే శత్రువుల మారిన జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల మరికొన్ని రోజుల్లోనే ఒకే వేదికపై కనిపించబోతున్నారు. వీరి కలయికకు విజయవాడ వేదిక కాబోతుంది. జులై 8వ తేదీన.. వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు జరగబోతున్నాయి. ఈ జయంతి వేడుకలను షర్మిల చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. Ys Sharmila

ఇందులో భాగంగానే ఏపీ అలాగే తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు… ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపారు షర్మిల. ఇక ఈ ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ షర్మిల ఇవ్వడం జరిగింది. తన తండ్రి జయంతి కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వేడుకకు ఖచ్చితంగా రాబోతున్నారు. ఒకవేళ ఆ షర్మిల పైన కోపంతో రాకపోతే మళ్లీ జగన్మోహన్ రెడ్డి పై వ్యతిరేకత మొదలవుతుంది. తండ్రి కార్యక్రమానికి రాలేకపోతున్నాడని ఆయనపై నెగిటివ్ టాక్ వెళుతుంది. కాబట్టి మరోసారి షర్మిల కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారన్నమాట. Ys Sharmila