Balayya: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో… ఏపీలో జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చేసేందుకు… వరుసగా చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యం లో నారా చంద్రబాబు నాయుడు కు ఊహించని షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి అర్ధాంతరంగా బాలయ్య హైదరాబాద్ వెళ్లిపోయారట. Balayya

Balayya who sold on Chandrababu

చంద్రబాబు పైన అలిగి బాలయ్య… హైదరాబాద్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో మూడు సార్లు ఎమ్మెల్యేగా బాలయ్య గెలిచారు. 2014 2019 2024 ఇలా వరుసగా హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈసారి చంద్రబాబులో బాలయ్యకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బాలయ్యకు నిరాశ మిగిలింది. Balayya

Also Read: Vijayasai Reddy: విజయసాయి కొత్త ఛానెల్ లాంచ్…అతనే CEO ?

దీంతో ఏపీ అసెంబ్లీని వదిలేసి బాలయ్య ఇంటికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ కూడా తీవ్రస్థాయిలో… రెస్పాండ్ అవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్కు ఇప్పుడు బాలయ్యకు వెన్నుపోటు పొడిచాడని చంద్రబాబుపై వైసీపీ మండిపడుతోంది. నందమూరి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేస్తాడని ఈ ప్రచారం చేస్తున్నారు. Balayya

అయితే ఈ వార్తలు బాగా వైరల్ కావడంతో.. బాలయ్య సన్నిహితులు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారట. చంద్రబాబు పైన అలిగి బాలయ్య హైదరాబాద్ కు వెళ్లలేదని చెబుతున్నారు. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లినట్లు పేర్కొంటున్నారు. మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బాలయ్య అసలు షూటింగ్లకు వెళ్లలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం జరుగుతుంది. అందుకే నేరుగా షూటింగ్లకు హైదరాబాద్ కు వెళ్లినట్లు చెబుతున్నారు బాలయ్య సన్నిహితులు. Balayya