Revanth Reddy: కులగణన పేరిట రూ.160 కోట్ల భారీ స్కాం?


Revanth Reddy: కులగణన పేరిట రూ.160 కోట్ల భారీ స్కాం జరిగినట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కులగణన సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు ఇంకా డబ్బులు ఇవ్వలేదట కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటలో ఎన్యుమరేటర్లు, రూ. 160 కోట్లు ఎవరి జేబులోకి పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియా వార్తలు వైరల్‌ చేస్తోంది.

Big Shock To cm revanth reddy

ప్రతిష్టాత్మకంగా కులగణన పూర్తి చేశాం అని గొప్పలు చెప్పుకున్న రేవంత్ ప్రభుత్వం….కులగణన పేరిట రూ.160 కోట్ల భారీ స్కాంకు తెరలేపినట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వివాదాస్పదమైన బీసీ జనాభా లెక్కలు, 6 శాతం ఎలా తగ్గిందో చెప్పాలని నిలదీశాయి బీసీ సంఘాలు.

తూ.. తూ.. మంత్రంగా విడుదల చేసిన సర్వేని తప్పుబట్టారట సొంత పార్టీ బీసీ నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకునేందుకు సర్వేని కొనసాగిస్తున్నామని ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్. ఇక ఈ తరుణంలోనే… కులగణన పేరిట రూ.160 కోట్ల భారీ స్కాం జరిగినట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *